సత్యదేవుని సన్నిదిలో ఒకేరోజు 4800 వ్రతాలు..
Ens Balu
3
Annavaram
2021-11-13 10:50:17
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది. రెండురోజులు సెలవు కావడం, కార్తీక మాసం కావడంతో స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఈ ఒక్కరోజే 4800 సత్యన్నారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయంటే భక్తుల తాడికి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నవరం పుణ్యక్షేత్రంలో మాత్రమే శ్రీ సత్యన్నారాయణ స్వామివారి వ్రతాలు జరుగుతాయి. ప్రతీఏటా కార్తీక మాసంలో ఈ వ్రతాలు లక్షల సంఖ్యలో జరగడం విశేషం. ఎక్కువగా మండపాలు ఉండటంతో దేవస్థానానికి ఎంతమంది భక్తులు వ్రతాల కోసం వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వ్రతాలు జరుగుతుంటాయి. దేశంలో ఏ దేవస్థానంలోనూ లేనంత మంది ఇక్కడ వ్రత పురోహితులు పనిచేస్తుండం కూడా ఒక చరిత్రగా చెప్పవచ్చు..