విద్యార్ధి దశనుంచే జనరల్ నాలెడ్జ్ లో పోటీపడాలి..ఎమ్మెల్యే పెట్ట ఉమాశంకర్ గణేష్


Ens Balu
3
Narsipatnam
2021-11-14 12:42:59

విద్యార్ధి దశనుంచే జనరల్ నాలెడ్జ్ లో మంచి ప్రావీణ్యం సాధించడం ద్వారా విద్య అనంతరం పోటీపరీక్షల్లో మంచి ఉద్యోగాలు సంపాదించడానికి ఆస్కారం వుంటుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఆదివారం నర్సీపట్నం స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేదిక ఫంక్షన్ హాల్ లో, బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్ధులకు క్విజ్, జనరల్ నాలెడ్జ్ పోటీలు పోటీ తద్వాన్ని పెంచుతాయన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైస్కూలు, కాలేజీ స్థాయిలో నిర్వహించిన ఈ జనరల్ నాలెడ్జ్, క్విజ్ పోటీల్లో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన 154 మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్థానాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి రానున్న రోజుల్లో ఉన్నత చదువుల్లో కూడా ఇదే పోటీని ప్రదర్శించాలని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి శ్రీనివాసరావు, స్టార్ ఫౌండేషన్ అధ్యక్షులు శర్మ ,కార్యదర్శి నాగిరెడ్డి, కోశాధికారి వూడ రాము తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు