గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు చైతన్యం పెంచుకోవాలి..
Ens Balu
3
Sankhavaram
2022-02-24 11:43:18
తెలియని వ్యక్తులు మాట్లాడే సమయంలో చనువు తీసుకొని నిర్జన ప్రదేశాల్లో తాక కుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష విద్యార్ధినిలకు సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని కస్తూరీబాగాంధీ స్కూలులో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ శిరీష మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని.. అది ఏవిధంగా ఉంటుందో ఇద్దరు విద్యార్ధినిలతో చేతులతో తాకి చూపించి విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో నెలిపూడి సచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి, స్కూలు ప్రిన్సిపాల్ రత్నం, ఉపాధ్యాయులు లలిత, అధిక సంఖ్యలో విద్యార్ధినిలు పాల్గొన్నారు.