కాకినాడ నగర పాలక సంస్థలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్ లుగా లభించింది. ఇంజనీరింగ్ విభాగంలో టైపిస్ట్ గా పనిచేస్తున్న కె. సతీష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ భాగ్యలక్ష్మి లకు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మంగళవారం పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. ఎస్.ఈ సత్య కుమారి, మేనేజర్ కర్రి సత్యనారాయణ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సిబ్బంది వీరిని అభినందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్బంగా వారికి సూచించారు. కార్యక్రమంలో సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.