నర్సీపట్నం మండలంలో చిరుత సంచారం


Ens Balu
4
Narsipatnam
2022-04-29 06:57:15

నర్సీపట్నం మండలం అప్పన్నపాలెం గ్రామ సమీపంలో చిరుత పులులు సంచరిస్తున్నా యి. అంతేకాదు పులుల పంజాకు రెండు ఆవులు మ్రుత్యువాత పడ్డాయి. ఇక్కడ చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పడానికి సంఘటనా స్థలంలో చిరుత నడిచిన ఆనవాళ్లు, కాలి ముద్రలు కూడా ఉన్నాయి. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తు న్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా కాకుండా చిరుత గాండ్రింపులు కూడా వినిపిస్తున్నాయని ఆందోలన వ్యక్తంచేస్తున్నారు. చిరుత దాడిలో మ్రుత్యువత పడిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతేకాకుండా అక్కడ చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వాటి చిత్రాలను మీడియాకి విడుదల చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో ఎవరూ బయట తిరగ వద్దని కూడా హెచ్చరికలు జారీచేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గస్తీ కూడా ఏర్పాటు చేస్తామని అప్పన్నపాలెం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. చిరుత సంచార విషయం నర్సీపట్నం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. 
సిఫార్సు