దుప్పలపూడిలో లే అవుట్ పరిశీలన..


Ens Balu
2
Duppalapudi
2022-04-29 12:00:06

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం లక్ష్యాలను నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాల్సి ఉందని జేసీ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. శుక్రవారం తుప్పలపూడి లే అవుట్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ లే అవుట్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఇసుక, సిమెంట్, ఐరన్ వంటి ముడి సరుకులు అందుబాటులో ఉంచుతున్నామని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అవగాహన పెంచి ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట మండల స్థాయి అధికారులు, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు