సాంఘిక సంస్కర్త రామానుజాచార్యులు


Ens Balu
2
Sarpavaram
2022-05-05 08:24:53

దిగువ వర్గాల సముద్ధరణకు మానవతా దృక్పథంతో కృషిచేసిన సాంఘిక సంస్కర్త భగవాన్ రామానుజాచార్యులు అని విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  శ్రీ రామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ,  1017 లో తమిళనాడు శ్రీ  పెరంబదూర్ లో  ఆయన జన్మించారని అన్నారు. వేదానికి సరైన నిర్వచనం చెప్పి సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అన్నారు. భారతీయ హిందూ తత్వ, వేదాంత తత్వాన్ని వెయ్యేళ్ళ కిందటే ప్రచారం చేశారని  అన్నారు. పరమాత్ముని  దృష్టిలో అందరూ సమానమేనని ,మోక్షానికి అందరూ అర్హులేనని శ్రీ రామానుజాచార్యులు    ఉపదేశించారు అని బాపిరాజు తెలిపారు.  రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు