ములక్కాలయవలసలో పరీక్షలు పరిశీలిన


Ens Balu
3
ములక్కాయలవలస
2022-05-06 09:16:35

 పార్వతీపురం మన్యంజిల్లాలో పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ములక్కాయలవలస మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  విద్యార్థుల కేటాయింపు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో సౌకర్యాల పట్ల ఆరా తీశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని చర్యలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుటకు బస్ సౌకర్యాల ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షలు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు