భారతదేశానికి ఒక వజ్రం గోపాలకృష్ణ గోకులే
Ens Balu
3
Sarpavaram
2022-05-08 07:52:40
స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు అయిన గోపాలకృష్ణ గోకులే మన దేశానికి లభించిన ఒక వజ్రమని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గోకులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేశ్వర రావు మాట్లాడుతూ,1866 మే 8న మహారాష్ట్రలో గోపాలక్రిష్ణ గోఖలే జన్మించారని అన్నారు. స్వాతంత్రం రాక ముందు విదేశాలలో ఉన్న భారతీయ హక్కుల సాధన పట్ల గోపాలకృష్ణ గోకలే శ్రద్ధ చూపేవారని అన్నారు. ఆయన ఉదారవాది, రాజ్యాంగబద్ధ ఉద్యమ సిద్ధాంతానికి నిబద్ధుడు అని అన్నారు .గోపాలకృష్ణ గోకలే తనకు రాజకీయ గురువని మహాత్మా గాంధీ కొనియాడడం గర్హనీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట రమణ, అడబాల రత్న ప్రసాద్, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.