ఆజాద్ కి అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని ఆమదాలవలస మండలం జొన్నవలస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ శిబిరంలో గుండె వ్యాధులు, క్షయ వ్యాధి, చర్మ వ్యాధులు, క్యాన్సర్, బీపీ, షుగర్, ఎముకలు, దంత వ్యాధులు వంటి పన్నెండు రకాల వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షలు చేసి వైద్యం చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కల్పించిన ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లో డీఎం & హేచ్ ఓ కె అనురాధ, మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.