కళాంజలి, జి.శిరీషలకు దిశ అవార్డులు
Ens Balu
14
Annavaram
2022-05-18 15:19:18
కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో ప్రజల ద్వారా అత్యధికంగా దిశ యాప్ ఇనిస్టాల్స్ చేయించిన గ్రామసచివాలయ మహిళా పోలీసులు పిఎస్ఎస్.కళాంజలి, జిఎన్ఎస్.శిరీషలకు అవార్డులు లభించాయి. అన్నవరం వన్ హోటల్ లో జిల్లా కలెక్టర్ క్రుతికా శుక్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు లతోపాటు పోలీసులు పాల్గొన్న ప్రత్యేక దిశ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టిరాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్వణచంద్రప్రసాద్ లు ఈ అవార్డులను అందజేశారు. జిల్లాలో శంఖవరం, అన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో దిశయాప్ లు రిజిస్ట్రేషన్లు చేయించడంలో వీరిద్దరు ప్రత్యేకంగా ప్రతిభను కబరిచారు. వీరికి అవార్డులు రావడం పట్ల సహచర మహిళా పోలీసులు నాగమణి, గంగగౌతమి, రజియాసుల్తానా, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామసచివాలయాలకు చెందిన మహిళా పోలీసులు, అన్నవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.