ఈవిఎం గోదాములను తనిఖీచేసిన కలెక్టర్
Ens Balu
8
Nellimarla
2022-07-02 10:41:06
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శనివారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీళ్లను పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, నెల్లిమర్ల తాశిల్దార్ రమణ రాజు, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేష్, ఇతర రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ సముద్రపు రామారావు, టిడిపి నాయకుడు స్వామి, సిపిఐ నాయకులు తాలాడ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు.