మీ సమస్యలు తీర్చేందుకే నేనొచ్చాను


Ens Balu
2
Madugula
2022-07-05 07:18:40

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను మీ ముందుకి వస్తున్నానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చీడికాడ మండలం శిరిజం గ్రామం, ఎస్సీ కాలనీలో  గారు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి , అవ్వ తాత, అక్క చెల్లెమ్మలను, యువతను, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతి అని, దానికోసమే నవరత్నాలు ప్రజల ఇంటిముంగిటకే తీసుకు వచ్చిందన్నారు. గ్రామస్థాయిలో సమస్యలు, ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పిందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే సంప్రదించాలని, అపరిష్క్రుతంగా వున్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్టు ఆయన వివరంచారు. మంత్రి తిరిపే ప్రతీ చోట ప్రజలు ఆప్యాయంగా పలుకరిస్తూ..హారతులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఫార్సు