రోడ్డు భద్రత కోసం పిల్లలకు తెలియజేయాలి


Ens Balu
9
Sankhavaram
2022-07-11 09:00:32

ఇంటి దగ్గర నుంచి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే సమయంలో  రోడ్డు ప్రక్కనుంచి నడుచుకుంటూ జాగ్రత్తగా  రావాలని గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష చిన్నారులకు తెలియజేశారు. సోమవారం కాకినాడ జిల్లా, శంఖవరం మండల కేంద్రంలోని సిబ్బంది వీధి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు రోడ్డు భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష మాట్టాడుతూ, వర్షాకాలం మొదలైనందున చిన్నారులకు కేంద్రంలో కాచి చల్లార్చిన నీటినే అందించాలన్నారు. అదేవిధంగా ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలన్నారు. కేంద్రానికి వచ్చే పిల్లలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. చేతులు పరిశుభ్రంగా కడిగిన తరువాత ఆహారాన్ని పెట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కూడా చిన్నారులకు నిత్యం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బుల్లెమ్మ, కేంద్రం సిబ్బంది అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.
సిఫార్సు