వైఎస్సార్సీపతోనే పేదలకు సమన్యాయం


Ens Balu
2
Seethanagaram
2022-07-13 14:38:35

పార్వతీపురం మన్యం జిల్లా  సీతానగరం మండలం జోగమ్మపేట గ్రామంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. గ్రామంలోని కాలనీలో ప్రతీ లబ్దిదారుని గడప వద్దకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలుంటీర్లుతో కలిసివెళ్ళి ప్రభుత్వం వారికి చేకూర్చిన ప్రయోజనాలను, గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటుగా వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. గత మూడేళ్ల కాలంలో లబ్దిదారునికి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తెలియజేసి, ఇంకా ఏమి చేయాలని అడుగుతూ ముందుకు సాగారు. గ్రామంలో గత మూడేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి పనులు చేశామని శాసన సభ్యులు చెప్పారు. నియోజకవర్గంలో 35 రోజుల పాటు కార్యక్రమాన్ని పూర్తి చేశామని, ఇంతవరకు 15 గ్రామ సచివాలయాల్లో పూర్తి చేశామని ఎమ్మెల్యే చెప్పారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మ, జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, నాయకులు బొంగు చిట్టిరాజు, శ్రీరాములునాయుడు, ఈశ్వర నారాయన, సర్పంచ్ కల్యంపూడి సింహాచలం, కల్యంపూడి శ్రీనివాసరావు, తెంటు వెంకటఅప్పల నాయుడు,సూర్యనారాయణ, రత్నాకర్, చింతల లక్ష్మణరావు, మహేష్, గాజాపు శ్రీను,కృష్ణంనాయుడు, ఆర్వీపార్థసారథి, అరవింద్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిడిఓ ప్రసాద్, తహసీల్దార్ రమణ,ఎంఈఓ సూరిదేముడు, ఏపిఓ నాగలక్ష్మి, తదితర అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలుంటీర్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సిఫార్సు