నర్సీపట్నం డివిజన్ లో సచివాలయ పరీక్షలు ప్రశాంతం..


Ens Balu
2
Narsipatnam
2020-09-20 17:10:01

నర్సీపట్నం డివిజన్ పరిధిలో గ్రామ ,వార్డు సచివాలయ పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య  పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షాకేంద్రాలలో పరీక్షల నిర్వహణ తీరు, వసతుల ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్లు కోవిడ్ నిబంధనలను  అమలు చేస్తున్నది, లేనిది పరిశీలించారు.అభ్యర్థులకు తప్పని సరిగా ధర్మల్ స్క్రీనింగ్  చేయడం , మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారా అని ఆరా తీశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసొలేషన్ గదులను పరిశీలించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా  పరీక్షలను సజావుగా నిర్వహించాలని సంబంధిత సెంటర్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా మంచినీరు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.