త్వరితగతిన రీసర్వే పూర్తిచేయాలి


Ens Balu
11
Seethanagaram
2022-07-29 13:47:22

పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో రీ సర్వే వేగవంతంగా పూర్తిచేయాలని  సబ్ కలెక్టర్ భావన పిలుపు నిచ్చారు. శుక్రవారం సాయంత్రం మండలములోని మరిపివలస, పాపమ్మవలస, నీలకంటాపురం గ్రామాలలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురోగతిపై ఆరాతీసి ప్రభుత్వ భూములు సర్వే, జిరాయితీ భూముల సర్వే నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సకాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేసేలా సిబ్బంది పనిచేయాలని తెలిపారు. రీసర్వేపై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, ఆర్ఐ రాజేష్, మండల సర్వేయర్ రాజ గోపాల్ నాయక్, వి ఆర్ ఓ లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు