సాహిత్యానికి సామాజిక ప్రయోజనం, జీవిత చిత్రణ వాస్తవికంగా ఉండాలని ఆ దిశగా ప్రముఖ కవి రావిశాస్త్రి పలు ప్రజా సమస్యలను తన సాహిత్యం ద్వారా ప్రభావితం చేశారని సాహిత్య వేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. శనివారం కాకినాడాలోని సర్పవరం జంక్షన్ బోటు క్లబ్ వాకర్స సంఘం ఆధ్వర్యంలో రావిశాస్త్రి జయంతి ఘనంగా జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1922 జూలై 30న విశాఖ జిల్లా తుమ్మపాల గ్రామంలో రావిశాస్త్రి జన్మించారని అన్నారు. కథ, నవల, నాటక ప్రక్రియ ఏదైనా రావిశాస్త్రి కలం దాన్ని ఒక సజీవ శిల్పంగా, మనోజ్ఞంగా మలచి పాటకున్ని మంత్రముగ్ధున్ని గావించారని అన్నారు. సమాజంలో పీడితులు, తాడితులు, నిరుపేదలు, నిర్భాగ్యులు, స్త్రీలు ఇలా అన్ని విధాల వెనుకబడిన వారిని ఉద్ధరించాలనేది ఆయన రచనలలో లోతుగా ఉండేదని అన్నారు. ఒకవైపు న్యాయవాది వృత్తి చేస్తూనే మరోవైపు రచనలు చేసేవారని శిరీష తెలిపారు .ఈ కార్యక్రమంలో న్యాయవాది యనమల రామం, అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.