ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లోమీడియా అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు భారీ వ్యూహమే రచించింది. దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే దుష్ట చతుష్టయం అనబడే ఎక్స్ పార్టీ మీడియాకు కౌంటర్ పడటమే కాదు.. ఏపీలో అసలైన ఆట మొదలైనట్టుగా భావించాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు యువత పనికి వచ్చే అన్ని రకాల ప్రసారాలు ఇందులో చేయాలని చూస్తున్నది. ఏది నిజం..ఏది అవాస్థవం.. మరేది తప్పుడు, అసత్య ప్రచారం అనేది ప్రభుత్వ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల కళ్లముందు ఉంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకి వేస్తోంది. దానికోసం ఏపీఎస్ఎఫ్ఎల్ ను వేదికగా చేసుకుంది రాష్ట్రప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీఫైబర్ నెట్ ను భారీ ఎత్తున విస్తరిస్తున్నారు. కేబుల్ టీవీతోపాటు, ఇంటర్నెట్ సౌకర్యం అతి తక్కు మొత్తానికే రావడంతో రాష్ట్రప్రజలందరూ దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా ఎక్కువ మంది ప్రజలకు చేవరుగా ఉండే ఏపీఎస్ఎఫ్ఎల్ వేదిక ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ వుంటే ప్రతిపక్ష మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు సంక్షేమ పథకాలు, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి రంగంలోనికి దిగింది.
నిరుద్యోగ యువతకు ఉపాది..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని జర్నలిస్టులకు ఉపాది దొరుకుతుంది. జిల్లాకి ఒక రిపోర్టర్, ఒక కెమెరా మేన్ తోపాటు కేంద్ర కార్యాలయంలో సబ్ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీర్లు, ఎస్ఎన్జీ టెక్నీషియన్లు, డ్రైవర్లు, పీసీఆర్, ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారికి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇంజనీర్లుగా, కార్యాలయ సిబ్బందిగా మరికొంత మందికి కూడా అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉపాది చూపడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతీ ఇంటికి చేరవేసేందుకు వీలుగా వుండేలా ప్రసారాలు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
కొత్త జిల్లాలకి వినూత్న ప్రచారం..
ఇప్పటి వరకూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియా వలన రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటైనా దాని సమాచారం గానీ, అధికారులు, ఇతర 75 ప్రభుత్వ శాఖలకు చెందిన ఆఫీసర్ల వివరాలును తెలియజేసేందుకు ఏ ఒక్క మీడియా కూడా ముందుకి రావడం లేదు. దీనితో ఇప్పటికీ చాలా మంది ప్రజలు పాత జిల్లాల కలెక్టరేట్లకే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ సమస్యలపై అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించడంతోపాటు కొత్త జిల్లాల స్వరూపం, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వ అధికారిక న్యూస్ ఛానల్ లో ఏర్పాటు చేసి ప్రచారం కల్పించ నున్నారు. దాని ద్వారా ఏఏ కొత్త జిల్లాల్లో ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయనే విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన రావడంతోపాటు ప్రజలు కూడా చైతన్యం కావడానికి ఆస్కారం వుంటుంది.
ప్రత్యక్ష ప్రసారాల లీజులకు చెల్లు చీటి..
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టీవీ ఛానళ్లకు ఫీడ్ ఇచ్చేందుకు వివిధ ప్రైవేటు సంస్థలకు వందలాది కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్ లకే అప్పగించి ఆ మొత్తాన్ని ఇదే సంస్థకు వెచ్చించడం ద్వారాప్రత్యక్ష ప్రసారాలు చేసే యూనిట్లు, కెమెరాలు, ఇతర సాంతికే వ్యవస్థ కొనుగోలు చేసుకోవడానికి వీలుపడుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికితోడు ఒక్కసారి పెట్టుబడి పెడితే వాటితో చాలా సంవత్సరాల పాటు సేవలు అందించవచ్చునని..తద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా ప్రచారాల ఖర్చు భారం తగ్గుతుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ టీవీ ఛానల్ ను సమాచారశాఖ కు అనుసంధానించడం ద్వారా ప్రతీ జిల్లాలోనూ జరిగే కార్యక్రమాలను, సదరు న్యూస్ వీడియోలను డీపీఆర్వో కార్యాలయాల నుంచే పంపించుకునే ఏర్పాటు చేయాలని కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సమాచారశాఖలో ఖాళీగా వున్న సిబ్బందిని భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ కు సిబ్బంది కూడా అందుబాటులోకి తీసుకు రావొచ్చుననేది ప్రభుత్వ బావన. చూడాలి ప్రభుత్వం సొంతంగా న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే ప్రతీపక్ష మీడియా ప్రచారాన్ని ఏవిధంగా తిప్పికొడుతుందో..ప్రజలకు ఏలాంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా అందిస్తుందనేది..!