శంఖవరం గ్రామంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శంఖవరం గ్రామానికి చెందిన కొండమూరి చంటిబాబు, ప్రమీల దంపతుల మనవరాలు షణ్ముఖి శ్రీ సమన్వి స్వామివారికి బంగారు నేత్రాలు బహూకరించారు. సుమారు 60 వేల రూపాయలతో (11 గ్రాములు) కూడిన వస్తువును ఆలయ ప్రోత్సాహకులు దాసరి లోవరాజుకు, కొండమూరి చంటిబాబు కుటుంబ సభ్యులు అందజేశారు. ఆలయ అర్చకులు చదువుల సాయికుమార్ శర్మ నేత్రాలను స్వామివారి, అమ్మవార్ల చెంత ఉంచి పూజలు నిర్వహించి అనంతరం స్వామివారికి అలంకరించారు. గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఈ కుటుంబ సభ్యులైన కొండమూరి చంటిబాబు ప్రమీల, సురేఖ సూర్యనారాయణ, నవీన్ కిరణ్ మై దంపతులు ధ్వజస్తంభం ఇచ్చియున్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి బాబ్జి, దాసరి శ్రీను, కుమార్, జట్ల రాంబాబు, బొర్ర శ్రీను, రేలంగి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.