అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలు


Ens Balu
6
K. Kotapadu
2022-08-24 13:44:03

గ్రామంలో అభివ్రుద్ధి జరగాలని ఆలోచిస్తే.. అందరికీ సంక్షేమం సులువవుతుందని డిప్యూటీ  సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. బుధవారం కే.కోటపాడు మండలంలోని ఇంటింటికీ మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రం లో  అవ్వ తాతలతో పాటు దివ్యాంగులు ,  దీర్ఘకాలిక వ్యాధి గ్రాస్తులకు జగనన్న ప్రభుత్వం ఎల్లవేళలా తోడు ఉంటుందని గడప గడపకు మన ప్రభుత్వం చేపడుతుందన్నారు. గ్రామానికి సంబంధించిన మౌళిక సదపాయాల గురించి గ్రామ పెద్దలతో చర్చించారు. గ్రామంలో పరిసరాలను పరిశీలించి పారిశుధ్య పనులపైన, ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పై అసంతృప్తి వ్యక్తం చేసి అధికారులపై  అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నాడు - నేడు మొదటి విడత పనులలో భాగంగా 18.48.లక్షల ఏర్పాటు చేసిన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో ఇతరత్రా మౌళికవసతుల కల్పన కోసం 20 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో కోటపాడు జెడ్పీటీసీ అనురాధ, ఎంపిపి రెడ్డి జగన్ మోహన్, ఎమ్మార్వో,  ఎంపిడిఒ, మండల, గ్రామ స్థాయి అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సిఫార్సు