స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి...


Ens Balu
2
Narsipatnam
2020-09-21 15:59:24

స్పందనలో వచ్చిన వినతులను పరిశీలించి  సమస్యల సత్వరం పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు.  సోమవా రం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 32 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అధికంగా భూ సంబంధిత సమస్యలు,రేషన్ కార్డ్ లు, పింఛన్లు తదితరాలపై వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా  సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కోవిడ్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు.సబ్ కలెక్టర్ కార్యాలయం లో వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వున్న ఆ ఫిర్యాదు బాక్సులో దరఖాస్తులు వేయవచ్చునన్నారు.  వాటన్నిటినీ పరిశీలించి నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ మౌర్య తెలియజేశారు.