గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి


Ens Balu
9
Muttukuru
2022-08-30 12:25:26

ప్రజలకు అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించడం తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఉదయం.ముత్తుకూరు మండల పరిధిలోని కృష్ణపట్నం, బ్రహ్మదేవి గ్రామాల్లోని సచివాలయాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కృష్ణపట్నం లో కలెక్టర్ కు వైస్ ప్రెసిడెంట్ రాగాల వెంకటేశ్వర్లు,మండలం ప్రత్యేక అధికారి మొక్కలు అందచేసి స్వాగతం పలికారు. సచివాలయం పరిధిలో ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని బియాండ్ ఎస్.ఎఎల్.ఎ లో వున్నాయి అని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

సచివాలయం సిబ్బంది నిబద్దతతో పనిచేసి ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయం హాజరు రిజిస్టర్ ను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ సర్వీసెస్ పై ప్రజల్లో అవగాహన కల్పించి రెవెన్యూ సర్వీసెస్ ను ఇంప్రూవ్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు.

 సచివాలయం పరిధిలో బూస్టర్ డోసు ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఏ.ఎన్.ఎం లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ప్రత్యేక అధికారి సోమయ్య, తహసిల్దార్ మనోహర బాబు, కృష్ణపట్నం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ రాగాల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, విఆర్ఓ అవినాష్, వాలంటీర్లు, కృష్ణపట్నం గ్రామ సచివాలయం, బ్రహ్మదేవి సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
సిఫార్సు