వై.యస్.ఆర్. పెన్షన్ కానుక అవ్వ, తాతల అవసరాలకు వినియోగిస్తారని జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్ డా. డి.వి. విద్యాసాగర్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం మండలంలోని రాయిపాడు పంచాయితీ, గూడెం పంచాయతీలలో అవ్వ, తాత, వితంతువులకు వై.యస్.ఆర్. పెన్షన్ కానుక పింఛను ప్రోజెక్ట్ అధికారి అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో ఈ.రఘు, ఎంపిడిఓ పెన్షన్లు విభాగం పర్యవేక్షకులు బివివిఎస్ దొర, పంచాయితీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.