ప్రజల గుండెల్లో చినస్థాయిగా నిలిచిపోయిన నేత దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు పసగడుగుల గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం గొలుగొండ మండలం క్రిష్ణదేవీపేట గ్రామంలో వైఎస్సార్ 13వ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడి విగ్రహానికి సర్పంచ్ పి.సత్యాన్నారాయణతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గిరిబాబు మాట్లాడుతూ, తెలుగు ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునే నేత వైఎస్సార్ అని..ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, వైద్య సేవలు, పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాల్లో ప్రజలంతా అనునిత్యం ఆ మహానేతను స్మరిస్తూనే ఉంటారని అన్నారు. భౌతికంగా డా.వైఎస్సార్ మన మధ్య లేకపోయినా..ఆయన రాష్ట్రానికి చేసిన సేవ, అభివ్రుద్ధిలో ఎల్లప్పుడూ చిరంజీవిగానే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీనాయకులు పందిరి వెంకటరమణ, జి. అర్జున, ఎం.వరహాలు, తదితరులు పాల్గొన్నారు.