ఈవీఎం గోడౌన్‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్


Ens Balu
12
Nellimarla
2022-09-02 10:05:48

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌లోని ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను జిల్లా  క‌లెక్ట‌ర్ ఎ. సూర్య కుమారి  శుక్రవారం త‌నిఖీ చేశారు.  కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు  గోదాముల   షట్టర్ల తాళాలను పరిశీలించి రికార్డులలో సంతకాలను చేసారు. కలెక్టర్ వెంట  జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌పతిరావు, నెల్లిమర్ల తహసిల్దార్ రమణ రాజు, ఎం.పి.డి.ఓ గిరిబాల. మున్సిపల్ కమీషనర్ ఫై. బాలాజీ ఎన్నికల సూపరింటెండెంట్ , సిబ్బంది తదితరులు  వున్నారు.
సిఫార్సు