కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రంలోని గొల్లవీధి శ్రీ క్రిష్ణాలయంలో ఆగస్టు3 శనివారం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. క్రిష్ణాష్టమి పర్వదినాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. క్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని నాటి నుంచి నేటి వరకూ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం భజనా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చామని తెలియజేశారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచే అన్నదానం ప్రారంభం అవుతుందని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.