నిర్మాణాలకు అవసరమైన భూములు గుర్తించాలి


Ens Balu
7
Kadiam
2022-09-03 10:44:25

ప్రాధాన్యత భవనాలు నిర్మాణానికి అవసరమైన భూములు గుర్తించి నివేదిక ఇవ్వాలని, అదే రోజు ఆయా భవనాల పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. శనివారం ఉదయం కడియం, వేమగిరి లలో స్కూల్స్ నాడు నేడు పనులను, మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేసి, ప్రాధాన్యత భవనాలు కోసం స్థలం గుర్తింపు విషయమై క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ,  ప్రతి సచివాలయం పరిధిలో ఒక సచివాలయ భవనం , ఆర్భికే, హెల్త్ సెంటర్ భవనాలు ఏర్పాటు చేయ్యాల్సి ఉందన్నారు. ఇందు కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి రెండువేలు జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. 

ప్రతి వారం ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రాధాన్యత భవనాలు పనులపై మూడు పర్యాయాలు సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.  క్షేత్ర స్థాయి లో అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి పనితీరు చూపాల్సి ఉందని స్పష్టం చేశారు.  సోమవారం నాటికి స్థలం గుర్తించి,  పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. బుధవారం నాటికి పనులు ప్రారంభించినట్లు నివేదిక ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాతం చేసేందుకు కాదు ఇక్కడ మీరు విధుల్లో ఉన్నది, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు అవసరమైన భూముల గుర్తింపు భాధ్యత మీదే అని పంచాయతీ సిబ్బందికి కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఎస్ ఈ .. ఎబివి ప్రసాద్, డి ఈ వో . ఎస్. అబ్రహం, ఎంపీడీఓ కె. రత్నకుమారి, సంబందించిన శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకుని రానున్న దృష్ట్యా ప్రాధాన్యత భవనాలు మరింత వేగంగా పూర్తి చేయాలనే కార్యాచరణ రూపుదిద్దామన్నారు. జిల్లాలో 1101 భవనాలను నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగిందన్నారు.  అందులో భాగంగా కడియం లో ఆర్భికే పనులను పరిశీలించడానికి రావడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. 
సిఫార్సు