మాతృత్వానికి ప్రతిరూపం మదర్ తెరిస్సా


Ens Balu
6
Kakinada
2022-09-05 08:49:02

దీన జనుల కోసం నిస్వార్ధమైన సేవలు అందజేసిన మదర్ తెరిస్సా మాతృత్వానికి ప్రతిరూపమని, ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విశ్రాంత ఉపాధ్యాయులు పరస సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 612 మిషన్లతో వంద దేశాలలో సేవలు అందించి విశిష్ట నోబుల్ శాంతి బహుమతిని ఆమె పొందారన్నారు. రోగులకు సేవ చేస్తున్న సమయంలో నేను సాక్షాత్తు భగవంతునికి సేవ చేస్తున్నట్లు భావిస్తానని ఆమె తెలిపారని అన్నారు. 1977 సెప్టెంబర్ 5న ఆమె మరణించి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డారని సత్యనారాయణ తెలిపారు.  ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, డాక్టర్ కుమార్ యాదవ్, రాజా, రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


సిఫార్సు