చక్కని ఆరోగ్య శైలి కోసం అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవాలని ఫార్మసిస్ట్ లిఖిత రాజమహేంతి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నేడు మనకు లభించే అన్ని ఆహార పదార్థాలు ఎరువులు, క్రిమి సంహారిక మందులు, కల్తీలతో లభించడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయన్నారు. అదేవిధంగా చిన్న చిన్న రోగాలకు మందులు వాడకుండా ఆహార పదార్థాలలో మార్పుల ద్వారా కూడా వాటిని నివారించవచ్చని అన్నారు. అధికంగా ఆకుకూరలు, పండ్లను తీసుకోవాలన్నారు కాఫీ, టీ, మైదా, వేపుడు పదార్థాలు, తీపి పదార్థాలు, కేకు వంటివి పరిమితంగా తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని రాజ మహంతి తెలిపారు . ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.