బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మో హన్రెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ఎ వి ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
పరకామణి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తిరుమలలో నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.23 కోట్లు విరాళంగా అందించిన దాత మురళీకృష్ణను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన విపిఆర్ విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.