ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానించాలి


Ens Balu
9
Kalla
2022-09-29 08:41:37

ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం ప్రతి ఓటరు చేయించుకోవాలని,బి యల్ వో, తది తర సిబ్బంది ఫారం 6 బి తో తమ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఓటరూ సహకరించాలని  జిల్లాకలెక్టర్  పి.ప్రశాంతి అన్నారు. గురువారం కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం పక్రియ కార్యక్రమం ను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం చేసుకోవాలని, యువత తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నప్పుడే ఆధారం నెంబరు వేసి లింక్ చేసు కోవాలన్నారు. ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం తో బోగస్ ఓట్లు ను తొలగించడం సులభం అవుతుందని ఆమె అన్నారు. 

బి యల్ వో , తది తర సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఓటరూ ఆధార్ నెంబరు చెప్పి అనుసంధానం చేసుకోవాలని,అందు బాటులో లేనప్పుడు వచ్చిన తరువాత పోలింగ్ బూత్ కు గాని బి యల్ వో కలసి ఆధార్ నెంబరు లింక్ చేసుకోవాలని ఆమె తెలిపారు. ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం  వేగవంతం చేసి నూటికి నూరు  అనుసంధానం పక్రీయ పూర్తి చెయ్యాలని అధికార్లకు జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టరు వెంట ఆర్ డి వో దాసి రాజు, తహశీల్దారు టి ఏ కృష్ణా రావు,ప్రత్యేక అధికారి యం.రవి కుమార్, తది తర సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు