ప్రతీ రైతు ఈ-క్రాప్ లో నమోదు కావాల్సిందే


Ens Balu
21
Kovvur
2022-10-19 14:52:47

రైతులు సాగుచేసే పంటకు భరోసా ఇచ్చే దిశలో ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకునే లా శ్రమించాలని తూ.గో.జి. జెసి సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం లోని మద్దూరు, మద్దురులంక  గ్రామాల్లో  ఈ క్రాప్ నమోదు చేసుకున్న పలువురు రైతుల రికార్డ్స్ లను  జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  సాగు చేసే ప్రతి రైతు తాను  సాగు చేసే  భూమిని ఖచ్చితంగా  ఈకేవైసీ లో నమోదు అయ్యేలా చూసుకోవాలన్నారు.   ఇందుకోసం ఆర్ బి కే , సచివాలయ వ్యవస్థ లో పని చేసే వ్యవసాయ అనుబంధ రంగంలోని సిబ్బందికి క్షేత్ర స్థాయి లో తగు సమాచారం సేకరించి వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చెస్తున్నట్టు పేర్కొన్నారు.

 భూ యజమానులు, రైతులు వారి సెల్ ఫోన్లు కి వొచ్చే  ఓ టి పి వివరాలు వ్యవసాయ సిబ్బందికి తెలియ చేసి వారు సాగు చేసే పంట ఈ క్రాప్, ఈ కేవైసి  అయ్యేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కేవైసి పూర్తి చేసిన వాటికి సంబందించిన రికార్డులను రాండమ్ గా పరిశీలించి, క్షేత్ర స్థాయి లో ధృవీకరణ చెయ్యడం జరుగుతోందన్నారు.

మద్దూరు లంక గ్రామంలో బొలిశెట్టి చిట్టి రామకృష్ణ , బొలిశెట్టి చిట్టినాగు,  చిగురులంక గ్రామంలో బొలిశెట్టి భాగయ్య మద్దూరు గ్రామంలో అన్నంరెడ్డి సూర్యారావు అన్నంరెడ్డి యతేంద్ర కుమార్ లు సాగు విస్తీర్ణం ఈ క్రాప్, ఈకెవైసి నమోదు వివరాలు తనిఖీ చేసి, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట  వ్యవసాయ అధికారి సహాయ సంచాలకులు చంద్రశేఖర్,  తహశీల్దారు బి. నాగరాజు నాయక్ , జి.సత్యనాయణ, సచివాలయ, అర్భికే వ్యవసాయ, హార్టికల్చర్  సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది,  రైతులు ఉన్నారు.
సిఫార్సు