ఏజెన్సీలో సత్వరమే నిర్మాణాలు పూర్తిచేయాలి


Ens Balu
10
Rampachodavaram
2022-11-15 12:48:09

రంపచోడవరం  ఏజెన్సీలోని  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న వివిధ భవనాలు త్వరితగతిన పూర్తిచేయాలని  రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సూరజ్ గనోరే సంబంధిత ఇంజనీర్లను  ఆదేశించారు, మంగళవారం  ఐటీడీఏ పీఓ చాంబర్లో  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న భవనాలు పై సంబంధిత ఇంజనీర్లతో  ప్రాజెక్ట్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా పీఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏడు మండలాలలో నాబార్డ్, సి సి డి పి, నిధులతో నిర్మిస్తున్న భవనాల ప్రగతిని ప్రాజెక్ట్ అధికారి మండలాల వారీగా నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు , నాబార్డ్, సి సి డి పి,నిధులు ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది  ఇంకా ఎంత నిధులు అవసరమోగుచున్నవిది మండలాల వారీగా ఆయన ఆరా తీశారు. ఈ శాఖ ద్వారా నిర్మిస్తున్న కల్వట్, గోడౌన్లు. తదితర భవనాలకు ఇసుక, సిమెంటు, మెటల్ ఎక్కడ నుండి కొనుగోలు చేయుచున్నది అదేవిధంగా మెటల్ యూనిట్ ఖరీదు ఎంత  ఇసుక యూనిట్ ఖరీదు ఎంత అదేవిధంగా ఇసుక, సిమెంటు, మెటల్ ఎంత పట్టుతున్నది తదితర వివరాలు   ప్రాజెక్ట్ అధికారి అడిగి తెలుసుకున్నారు. గుడిస  పర్యటక ప్రాంతాములో నిర్మిస్తున్న  భవనాలు, బొదులూరు గ్రామంలో నిర్మిస్తున్న గోడన్ రాజవొమ్మంగి,అడ్డతీగల మండలల లో నిర్మిస్తున్న కల్వర్టులు,కు సంబంధించిన పనులు ఈ దశలో ఉన్నవి ఆయన ఆరా తీశారు.

ఈ భవనాలకు ఏ సైజు మెటలు అవసరమగుచున్నది ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు , గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న భవనాలన్నిటికీ కరెంటు తో సహా  మౌలిక సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు, ఏజెన్సీలోని  ఎంపీక చేసిన ప్రదేశాలలో హాట్ బజార్లు ఏర్పాటు చేయుటకు ఎక్కడెక్కడ ఎంపిక చేసింది ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. డేవిడ్ రాజ్, ఆస్టింటే ఇంజనీర్లు, సత్యనారాయణ, నాగరాజు, మహేశ్వర రావు, వీరభద్రరావు  తదితరులు పాల్గొన్నారు,

సిఫార్సు