అన్నవరంలో మళ్లీ అన్నప్రసాదం అరిటాకులోనే


Ens Balu
30
Annavaram
2022-12-09 06:31:47

అన్నవరం దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన పథకంలో దేవస్థానం అధికారులు తిరిగి అరిటాకులోనే భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఆకుల కోసం ప్రతీఏటా అత్యధిక మొత్తం ఖర్చు అవుతుందని.. ఆ అదనపు ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన కంచంలోని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిలిపివేశారు. శుక్రవారం నుంచి మళ్లీ అన్నసత్రంలో యధావిధిగా దేవస్థానంలో అరికటాకులో స్వామివారి అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. పీఠాధిపలులు, పలువురు స్వామీజీలు అన్నవరం పుణ్యక్షేత్రంలో ట్రస్టుబోర్టు తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తప్పుపట్టడంతో గత్యంతరం లేక తిరిగి అరిటాకుల్లోనే ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. 
స్టీలు కంచాల్లో భోజనాలు పెట్టడంపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా ఇపుడు అన్నదానం కోసం ప్రత్యేంగా తీసుకున్న రెండు వేల స్టీలు కంచాలు మూలకు చేరినట్టు అయ్యింది.
సిఫార్సు