ఏజెన్సీలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు ఆధార్ బ్యాంక్ అకౌంట్లో అనుసంధానంతో లబ్ధిదారుల ఎకౌంట్లో నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. బుధవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశంహాలులో ఏపీవో జనరల్, ఎపీడీ వెలుగు, ఏడిఎం అండ్ హెచ్ ఓ, డి ఎల్ డి ఓ. పి హెచ్ ఓ, అగ్రికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ తాసిల్దార్, ఎంపీడీవో, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అధికారి, ఆధార్ సెంటర్ కోఆర్డినేటర్ తదితరులతో ప్రభుత్వం పథకాలు నేరుగా లబ్ధిదారులకు సకాలంలో అందించే విధంగా ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ, ప్రతి ఐటీడీఏలో ప్రోగ్రాం రివ్యూ కమిటీలు (పిఆర్ సి)గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి వారి ఆదేశాల మేరకు నాతోపాటు మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారని అదేవిధంగా అమ్మ ఒడి, రైతు భరోసా. ప్రధానమంత్రి కిసాన్ పథకం, అడవి హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన రైతులకు అదేవిధంగా రైతులకు భరోసా పథకం వర్తింపు, ఉపాధి హామీ పథకం తదితర పథకాలపై మండలాల వారిగా ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు.
అమ్మ ఒడి పథకం ద్వారా. ఇప్పటివరకు ఎంత మంది లబ్ధిపొందినది ఆదివిధముగా ఆధార్. బ్యాంకు అకౌంట్లు తప్పులను ఎంతమందికి సరిచేసింది అయన ఆరాతీశారు. పియం కిసాన్ పథకం ఇకెవైసి.డెలివరీ అయినా ప్రతి స్త్రీ కి తప్పనిసరిగా చేయించాలని అన్నారు. ఆర్ఓయఫ్ఆర్ పథకం నుండి పట్టాలు పొందిన రైతుకు రైతు భరోసా పథకం అమలు చేయాలనీ అన్నారు, ఏజెన్సీ లోని జాబ్ కార్డ్ ఉన్న ప్రతి వ్యక్తికి వంద రోజలు ఉపాధి పనులు ఎంతమందికి కల్పించిన ది అదేవిధముగా ఎన్ని జాబ్ కార్ట్ లు ఉన్నవి మండలాల వారీగా అయన ఆరాతీశారు,10సంవత్సరం ముందు ఆధార్ కార్డ్ చేయింకున్న ప్రతి వారు తిరిగి ఆప్లోడ్ చేసుకోలాని అన్నారు.
ఆదివిధముగా 10ఎకరాల భూమి ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు రావని అందుకు కుటుంబ సభ్యులకు మ్యూటేషన్ తప్పనిసరిగా చెయ్యలని అన్నారు, ముందుగా చనిపోయిన వారి గురించి గ్రామ సభ నిర్వహించాలని అన్నారు, అన్ని గవర్నమెంట్ పధకలకు ప్రతి ఇంటికివెళ్లి సర్వే చేయాలనీ అన్నారు, ప్రభుత్వం పధకలకు మోనేటరింగ్ చేయాలనీ పియంయూ అధికారిని ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ జనరల్ సి హె. శ్రీనివాసరావు. ఏపిడి వెలుగు ఎ.శ్రీనివాసరావు. ఏడియం అండ్ హెచ్ వో.టి. అనూష. పీహెచ్ఓ. కె. చిట్టిబాబు. డి ఎల్ డి ఓ. కె. కోటేశ్వరరావు. ఎంపీడీవో ఎం వి ఆర్ కుమార్ బాబు. తాసిల్దార్ పి. వెంకటేశ్వరరావు. ఏ డి ఏ సిహెచ్ కెవి చౌదరి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అధికారిని డి. సారా కోసల. మండల అగ్రికల్చరల్ అధి కారి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.