వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. శనివారంలో కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు అడబాల రత్న ప్రసాద్ అధ్యక్షతన వినియోగదారుల రక్షణ చట్టం వారోత్సవాలను పురస్కరించుకుని జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నష్టపోయిన వినియోగదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించడానికి చట్టం రూపొందించింది అని అన్నారు. వస్తువు కొన్న తర్వాత సేవలు అందించకపోయినా, అసంపూర్తి సేవలకు కూడా పరిహారం పొందవచ్చని అన్నారు. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు తీసుకున్నప్పుడే వినియోగదారుడికి హక్కు వస్తుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.