శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాకి ఒక ప్రకటన విడుదల చేసారు. డిసెంబర్ 30వ తేది ఉదయం 8 గం.లకు దేవాదాయ శాఖ సమక్షంలో అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను నిబంధనల ప్రకారం తెరవనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.