ఐక్యత తోనే జర్నలిస్టుల హక్కులు సాధించుకోవాలి


Ens Balu
21
Pendurthi
2022-12-30 11:58:59

ఐక్యత తోనే జర్నలిస్టులు హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం వుంటుందని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎస్సిఆర్డబ్ల్యూఏ( కంచరపాలెం టూ పెందుర్తి యూనిట్ ) సభ్యుల డైరీ,స్వీట్స్ పంపిణీ  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని సూచించారు. జర్నలిస్టులకు అండగా ఎల్లప్పుడూ అసోసియేషన్ ఉంటుందన్నారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంఘంగా వారి యోగ క్షేమాలు, కష్ట నష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయలతోనే ఉంటున్నామన్నారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సుమారు  6 ఏళ్ళు అవుతొందన్నారు. ఈ ఆరేళ్లలో అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

 సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులు తమ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని అన్నారు.
 సీనియర్ పాత్రికేయులు మహేష్,  నాయుడు, సతీష్ తదితరులు జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు. అనంతరం సభ్యులకు డైరీలు,మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),ఉపాధ్యక్షులు పద్మజ,జాయింట్ సెక్రెటరీ వినోద్ ఇతర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
సిఫార్సు