జీవీఎంసీ 22వ వార్డులో అర్హులైన వారందకి పించన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తున్నట్టు కార్పోరేటర్ మూర్తియాదవ్ తెలిపారు. సోమవారం వార్డులో కొత్తగా మంజూరైన 62 మంది లబ్ధిదారులకు ఆయన ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో మానసిక వికలాంగ, వృద్ధ, వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా ఈ పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ వెల్ఫేర్ కార్యదర్సులు శశి కళ, రెహమాన్, సంపత్, అడ్మిన్ కార్యదర్సులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.