కోనసీమ జిల్లాలో 8,298 మందికి కొత్త పెన్షన్లు


Ens Balu
10
Amalapuram
2023-01-03 11:54:11

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో అర్హత ఉన్న వివిధ  కేటగిరీల వారికి కొత్తగా 8,298 పెన్షన్లు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం అవ్వ తాతలకు జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న వైస్సార్ పెన్షన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం నుండి ప్రారంభించిన నేపథ్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమకు పెన్షన్ మంజూరు చేయాలని పలు ధఫాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పెన్షన్ పొందని వారు ప్రభుత్వం కల్పించిన మార్గదర్శకాలతో పెన్షన్ పొందడం వారిలో సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.శివశంకర్, అడిషనల్ డైరెక్టర్ జిలాని, అమలాపురం మున్సిపల్ కమిషనర్ వివిపి నాయుడు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
సిఫార్సు