సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టరు పి.ప్ర శాంతి ఆదేశించారు. నర్సాపురం పురపాలక సంఘం పరిధిలో 7వ వార్డులో ఉన్న మూడవ సచివాలయం జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడు తూ సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజే యాలన్నా రు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాల న్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ, డిఇవో ఆర్.వెంకట రమణ ఉన్నారు.