సింహాద్రి అప్పన్నకు ఎమ్మెల్సీ వంశీ ప్రత్యేక పూజలు


Ens Balu
17
Simhachalam
2023-01-04 08:31:40

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్ దర్శించుకొని పూజలు చేశారు.  బుధవారం ఆయన సతీసమేతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మల్సీ వంశీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఏపీలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పేదలకు ఇచ్చిన హామీలన్నీ 90% నెరవేర్చారని అన్నారు. ఆయనకు ఆ సింహాద్రి అప్పన్న మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి, రాష్ట్ర ప్రజలు శుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. అంతకుముందు వేద పండితిలు, ఆశీర్వచనం, ప్రసాదాలను ఆయకి అందజేశారు.
సిఫార్సు