సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎలమంచిలి వచ్చి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. భార్య, కుమారుడు, కుమార్తెలకు, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం మధ్యాహ్నం గం.12-25 ని.లకు హెలికాప్టర్లో ఎలమంచిలి కళాశాల మైదానం చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి బూడీ ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్వాగతం పలికారు.
అనంతరం ఆడారి తులసిరావు పార్సివదేహాన్ని దర్శించిన అనంతరం ముఖ్యమంత్రి హెలిపాడ్ దగ్గర ఇద్దరు బాధితులను కలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి వారికి సీఎం సహాయ నిధి నుండి లక్ష రూపాయల చొప్పున చెల్లించమని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి గం.12-55ని. లకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖపట్నం అక్కడి నుంచి విజయవాడ వెళ్లేందుకు బయలుదేరారు.