ప్రత్తిపాడులో దూకుడు పెంచిన వరుపుల రాజా


Ens Balu
15
Yeleswaram
2023-01-05 12:00:02

ప్రత్తిపాడు నియోజవకర్గంలో టిడిపీ నేత వరుపుల రాజా తన దూకుడు పెంచారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట  గ్రామంలో 100 మంది గిరిజనులు   వైస్సార్సీపీని విడిచి టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ వరుపుల వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ, వరుపుల రాజా నాయకత్వంపై  నమ్మకంతో  టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజాను ఎమ్మెల్యే గా  అత్యధిక  మెజారిటీ తో  గెలిపించుకొంటామని పేర్కొన్నారు. రాజా మాట్లాడుతూ  రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతందని చెప్పడానికి పెరుగుతున్న చేరికలు, వైఎస్సార్సీపీని వీడుతున్న కార్యకర్తలే నిదర్శమన్నారు. నియోజకవర్గం లో  అనేక  గ్రామాలలో టీడీపీ  చేరడానికి  ఆసక్తి  చూపుతున్నారు  అన్నారు. కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
సిఫార్సు