డ్రోన్ తో మందుల పిచికారీపై రైతులకు అవగాహన


Ens Balu
6
Gajapatinagaram
2023-01-05 13:33:02

డ్రోన్ లతో పంటలపై పిచికారీ చేసుకోవడం ద్వారా సమాంతరంగా పంట మొత్తం మందు చల్లేందుకు వీలుంగా వుంటుందని జిల్లా వ్యవసాయాధికారి త్రినాధస్వామి రైతులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం గ్రామంలో వ్యవసాయంలో డ్రోన్ ల ఉపయోగంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ లతో ఏ విధంగా పంటలపై రసాయనాలను ఎలా పిచికారి చేయాలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, మొక్కజొన్న రైతులకు పంటకోత అనంతరం చేపట్టే మొక్క మొదళ్లు రైతులు కాల్చకూడదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ తేజస్వరరావు, ఏడీఏలు నాగభూషణ్, మహారాజన్, ఏవో ధనలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సామంతుల పైడిరాజు, గ్రామ వ్యవసాయ సహాయకుడు వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు