నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రపై వక్తృత్వ పోటీలు


Ens Balu
11
Visakhapatnam
2023-01-07 07:10:47

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్యసాలి అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర, జీవిత అంశాలపై నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలను ప్రభుత్వ విశాఖ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఏ.ఎస్. రాజా మహిళా జూనియర్ కళాశాల విద్యార్థి చెన్నా ప్రణాళిక, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని  నేతాజీ జీవిత అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ గొర్లి మహేశ్వరరావు, పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్. జల్దీ విజయ భారతి, మహ్మద్ షఫీ లు వ్యవహరించారు. ఈ పోటీల్లో గొర్లి మహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలను నిర్వహించామన్నారు. ఎంపికైన విద్యార్థులను  ఢిల్లీ లోని భారత పార్లమెంటులో ప్రసగించేందుకు పంపుతామన్నారు. డిల్లీలో జరిగే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం పరిపాలనాధికారి అల్లం రాంప్రసాద్, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు