పీఎంఎస్ఎంఏ ద్వారా గర్భిణీస్త్రీలకు వైద్య పరీక్షలు


Ens Balu
22
Sankhavaram
2023-01-09 12:06:15

గర్భంలో శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీ స్త్రీలు భలవర్ధక ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యాధికారి డా.సత్యన్నారాయణ సూచించారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమం లోభాగంగా పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రతీనెలా 9వ తేదిన పీఎంఎస్ఎంఏ పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించను న్నట్టు పేర్కొన్నారు. ఈరోజు వైద్య పరీక్షలు చేసిన వారిలో 14 మంది హైరిస్క్ తల్లులను గుర్తించామన్నారు. 34 మందికి  రక్తపరీక్షలు చేసిన ఐరన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హై రిస్క్ ఉన్నవారికి కాకినాడ జిజిహెచ్ కి రిఫర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు