ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా నివారణకు కృషి


Ens Balu
18
Paderu
2023-01-09 13:24:10

పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా నివారణకు కృషి చేయాలని ఐటిడిఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. సోమవారం పెరుమాళ్ స్వస్త్య సంస్థ ఆధ్వర్యంలో ఐటీడీఏ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సమావేశ మందిరంలో యూత్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ పై పెరుమల సంస్థ నిర్వహిస్తున్న అవగాహనపై సంస్థను ఆయన అభినందించారు పిరిమాల్ సంస్థ సేవలను 11 మండలాలకు విస్తరించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ భాగస్వామ్యంతో పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సికిల్ సెల్ అనిమియా బాధితులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు అందేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

సిఫార్సు