విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి అమర్


Ens Balu
14
Pendurthi
2023-01-10 07:43:06

ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ సోమవారం  విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న పీఠం వార్షిక మహోత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజశ్యామల యాగం నిర్వహణకు సహకరిస్తామని పీఠాధిపతులకు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాగంలో పాల్గొంటున్నందున చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో చర్చించారు.
సిఫార్సు